న్యూఢిల్లీ: ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు కలిశారు. వారి సమావేశం దాదాపు 45 నిమిషాలు సాగింది. ఈ సమావేశంలో సోనియా రాజకీయ వ్యవహారాల ఇన్ ఛార్జి అహ్మద్ పటేల్ కూడా పాల్గొన్నారు. ఉపఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కిరణ్ కుమార్ రెడ్డికి సోనియా సూచించారు.
ఇదిలా ఉండగా, సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు.
ఇదిలా ఉండగా, సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు.
No comments:
Post a Comment