న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ తొలి రోజున క్షణ తీరక లేకుండా విధుల్లో నిమగ్నమయ్యారు. మొదటి రోజున రాష్ట్రపతి భవన్ అధికారులతో ప్రణబ్ సమావేశాలు నిర్వహించారు. పదవి విరమణ చేస్తున్న రాష్ట్రపతి భవన్ కార్యదర్శి క్రిస్టి ఫెర్నాండెజ్ తో భేటి అయ్యారు. ఈ సమావేశంలో కార్యదర్శిగా ఎంపికైన అమిత్ పాల్ కూడా ఉన్నారు. ఆతర్వాత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీని ప్రణబ్ స్వాగతంగా ఆహ్వానించారు. రాష్ట్రపతి సెక్రటేరియట్ లో వివిధ విభాగాలను ప్రణబ్ కు పరిచయం చేశారు.
ప్రణబ్ తో రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, గవర్నర్లు రామ్ నరేశ్ యాదవ్(మధ్య ప్రదేశ్), బీఎల్ జోషి (ఉత్తర ప్రదేశ్), కే రోశయ్య (తమిళనాడు)లు మధ్యాహ్నం తర్వాత సమావేశమయ్యారు. సాయంత్రం పంజాబ్, నాగాలాండ్, ఉత్తరఖండ్, మేఘాలయ గవర్నర్లు సమావేశం కానున్నారు.
ప్రణబ్ తో రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోని, ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, గవర్నర్లు రామ్ నరేశ్ యాదవ్(మధ్య ప్రదేశ్), బీఎల్ జోషి (ఉత్తర ప్రదేశ్), కే రోశయ్య (తమిళనాడు)లు మధ్యాహ్నం తర్వాత సమావేశమయ్యారు. సాయంత్రం పంజాబ్, నాగాలాండ్, ఉత్తరఖండ్, మేఘాలయ గవర్నర్లు సమావేశం కానున్నారు.
No comments:
Post a Comment