ముంబయి : స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లన్నీ భారీ లాభాల్లో ఉండటంతో మన సూచీలు కూడా ఆ వేగాన్ని కొంత అందుకున్నాయి. సెన్సెక్స్ 210 పాయింట్ల దాకా లాభపడుతూ 16,850కి సమీపంలో ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకు పైగా పెరుగుతూ 5,110 పాయింట్లకు సమీపంలో ట్రేడవుతోంది. ఒక్క హెల్త్కేర్ సూచీ తప్పించి మిగిలిన సూచీలన్నీ లాభాల్లో ఉన్నాయి.
బ్యాంకులు, మెటల్ షేర్లు ఎక్కువగా లాభపడుతున్నాయి. గ్రూపు ఏలో టాటా మోటార్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ల్యాంకో ఇన్ఫ్రా, యునైటెడ్ బ్రీవరీస్ 3నుంచి 4 శాతం పెరుగుతూ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మరోవైపు సన్ టీవీ ఏకంగా 11 శాతానికి పైగా నష్టపోతూ టాప్ లూజర్గా ఉంది. థర్మాక్స్, ఎంఫసిస్, హీరో మోటోకార్ప్, ఆప్టో సర్క్యూట్స్ షేర్లు 1.5 నుంచి 4 శాతం నష్టపోతూ సన్ టీవీ తర్వాత టాప్ లూజర్స్గా ఉన్నాయి.
No comments:
Post a Comment